పాండవులకు ధైర్యం చేపిన శ్రీకృష్ణుడు


పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకసారి శ్రీకృష్ణుడు వారిని చూడటానికి వేళారు. శ్రీకృష్ణుడితో పటు కొంతమంది యాదవులు, ద్రౌపది సోదరుడు దృష్టదుమ్నుడు కూడా పాండవులను చూడటానికి వచ్చారు. శ్రీకృష్ణుడు వారిని చూసి ఈ కష్టాలు ఎక్కువకాలం ఉండవు అని ఓదార్చి ధైర్యం చెప్పారు. అప్పుడు పాండవుల మధ్యముడు అయినా అర్జునుడు శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణా! ఒకప్పుడు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసిన శ్రీమన్నారాయణుడిని నువ్వు దుష్టులను శిక్షించి చట్టానికి భూమండలంలో రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉంటావు. మహా తపస్సు నీవే చంద్రుడివి నీవే అగ్ని సకల దిక్పాలకుల నీవే ఇప్పుడు మీరు మండలం లో కృష్ణుడు గా అవతరించావు. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. నీవే మమ్మలిని రక్షించాలి అని వేడుకున్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునితో నాయన అర్జునా! నీకు ఇప్పుడు నిజం చెపుతున్నాను విను. మనం ఇద్దరము ఒకటే. నరనారాయణులము. నేను భగవంతుడిని అని నాకు గుర్తు ఉంటుంది కనుక నేను నారాయణుడిని. నీకు మరుపు వస్తుంది. అంటే ఇప్పుడు నేను భగవంతుడిని అంటున్నావు. కొంతకాలం తరువాత మళ్ళీ నువ్వు మా బంధువువి అంటావు అందుకని నివ్వు నరుడివి. మనం ఇద్దరము నరనారాయణులము. అయినా లౌకిక ప్రయోజనం కోసం మనం ఇద్దరు ఇలా కనిపిస్తున్నా ము నిజానికి ఇద్దరు ఒక్కటే. ఇంకా కొద్దిరోజులలోనే ఈ అరణ్య అజ్ఞాత వాసాల నుండి మీకు విముక్తి కలుగుతుంది. మీకు విజయం వరిస్తుంది అని అన్నాడు. అప్పుడు ద్రౌపది దేవి శ్రీకృష్ణుడితో ఏడుస్తూ ఈ లోకంలో ఏ స్త్రీకి జరగని అన్యాయం నాకు జరిగింది. నువ్వు నన్ను రక్షించావు కాబ్బటి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏమాయేది అని అన్నది. మళ్ళీ నేను పిలిచినా వెంటనే ఎందుకు రాలేదు ఆలస్యంగా వచ్చావు అని అడిగింది. అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అమ్మ ద్రౌపది నివ్వు నన్ను గోవిందా అనిపిలవగానే వద్దాము అనుకున్నాను. కానీ నేను ద్వారకావాసిని, వైకుంఠవాసిని అన్నావు ఆఖరికి హృదయంలో కొలువై ఉన్న వాడిని హృదయనివాసి అన్నావు. అప్పుడు వచ్చాను. రెండోది అయినా నీ చీర పైట కొంగును గట్టిగా పట్టుకొని ఆపటానికి నీఆత్మరక్షణ ప్రయత్నం నువ్వు చేసావు. తరువాత ఓడిపోయావు. అప్పుడు నేను వచ్చాను. భగవంతుడు మానవప్రయత్నం ఉనంతవరకు రాదు. మానవ ప్రయత్నం ఆగిపోతే భగవంతుని లీల మొదలవుతుంది. అలాగని మొత్తం భగవంతుని మీద వదిలేయకూడదు. ముందు మానవ ప్రయత్నం చెయ్యాలి అని అన్నాడు. సమయానికి నేను ఇంద్రప్రస్థంలో లేను. నేను మీదగరే ఉండిఉంటే మీకు ఈ కష్టం వచ్చేది కాదు. ఆ సమయంలోనే సాల్వుడితో నాకు యుద్ధం వచ్చింది. యుద్ధం అంత అయి మీ గురించి తెలుసుకునే తప్పటికే అంత జరిగిపోయింది అని అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ధర్మరాజా! మీ పాండవులకు ద్రౌపదికి అరణ్యవాసం అజ్ఞాత వాసం తప్పదు. నేను ఈ పదముడు సంవత్సరాలు సుభాద్రను అభిమాన్యుడిని నా వెంట తీసుకు వెళతాను వారు మాతోపాటు ద్వారకాలో ఉంటారు. నేను అప్పుడప్పుడు మిమల్ని చూడటానికి వస్తూ ఉంటాను అని చెప్పు పాండవుల దగ్గర సెలవు తీసుకొని శ్రీకృష్ణుడు యాదవుల సుభాద్ర అభిమన్యూలను తీసుకొని ద్వారకకు వెళ్లారు. తరువాత దృష్టదుమ్నుడు కూడా ద్రౌపది కుమారులను కూడా తీసుకొని పాంచాలానికి వెళ్లారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...